కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏడు రోజుల పాటు విశేష పూజలు
ఆగస్టు 13 నుంచి 19 వరకు ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు



మల్యాల | BSK న్యూస్, ఆగస్టు 12: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రావణ సప్తాహ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ప్రతిరోజూ స్వామివారికి వివిధ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులుతెలిపారు.శ్రావణ సప్తాహ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పసహస్రనామార్చన, సహస్రనామార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వరస్వామి, అమ్మవారి సన్నిధిలోనూ అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది.ఏడు రోజుల పూజా కార్యక్రమాలుఆగస్టు 13, గురువారం: శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు.ఆగస్టు 14, శుక్రవారం: స్వామివారికి విశేష అభిషేకాలు, పుష్పసహస్రనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ఆగస్టు 15, శనివారం: శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు.ఆగస్టు 16, ఆదివారం: స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, సహస్రనామార్చన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.ఆగస్టు 17, సోమవారం: శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించనున్నారు.ఆగస్టు 18, మంగళవారం: స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఆగస్టు 19, బుధవారం: శ్రావణ సప్తాహ ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామివారికి 108 ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, సహస్రనామార్చనతో పాటు శ్రీ వెంకటేశ్వరస్వామి, అమ్మవారి సన్నిధిలోనూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శ్రావణ సప్తాహ ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకునే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ ఈవో అంజన్న రెడ్డి తెలిపారు
