ఆధ్యాత్మికం

కొండగట్టు అంజన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ

కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

కొండగట్టు, ఆగస్టు 23: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివచ్చారు. ఆలయానికి చేరుకున్న భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తులు సజావుగా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. తాగునీరు, దర్శనం, భక్తుల రాకపోకలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజన్నరెడ్డి సూచనల మేరకు అధికారులు సునీల్, అశోక్, జెమిని, శ్రీనివాస్, ధర్మేందర్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏఎస్సై రమణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు భక్తుల రద్దీని నియంత్రిస్తూ సేవలు అందించారు.ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల దర్శనం సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారు.స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ పరిసరాల్లో పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం భక్తుల రద్దీతో కొండగట్టు ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో కళకళలాడాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *